నాగర్ కర్నూల్లో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్నగర్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ జన సమితి నాల్గవ ప్లీనరీ పోస్టర్ల విడుదల
నాగర్ కర్నూల్లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
సోషల్లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగర్ కర్నూల్లో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు
నాగర్ కర్నూల్ రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.
నాగర్ కర్నూల్లో అకాల వర్షాలు:తడిసిన మొక్కజొన్న కొనాలి-రైతులు
నాగర్ కర్నూల్లో అకాల వర్షాల వల్ల తడిసిన మొక్కజొన్నకు MSP ఇవ్వాలని రైతుల డిమాండ్… వెంటనే కొనుగోలు ప్రారంభించాలంటూ కలెక్టర్కు వినతి.
జిల్లాలో షి టీమ్ అవగాహన కార్యక్రమాలు.. విద్యార్థినులకు భద్రతపై చైతన్యం
నాగర్కర్నూల్ జిల్లాలో షి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రత, మహిళా రక్షణ, సైబర్ అవగాహనపై పలు మండలాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడంలో అంగన్వాడీల పాత్ర కీలకం
నాగర్కర్నూల్లో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో బాల్యవివాహాల నివారణలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.
నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను కలిసిన విద్యాశాఖ అధికారులు
నాగర్కర్నూల్ నూతన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్యా అభివృద్ధి, పాఠశాలల పురోగతిపై సమావేశంలో చర్చించారు.
జిల్లా 9వ కలెక్టర్గా హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతల స్వీకరణ
నాగర్కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటీల్ బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ
ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటించింది. శనివారం నుంచి బస్సు సర్వీసులు పునఃప్రారంభమై సాధారణ రాకపోకలు మొదలయ్యాయి.
