ప్రజాకవి కాళోజీ 112వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ భాషా సంస్కృతులు, ప్రజా చైతన్యానికి కాళోజీ చేసిన సేవలను జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు కొనియాడారు.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ టి. ఉషారాణి..
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రొఫెసర్ డాక్టర్ పి. సుప్రియ బాధ్యతలు స్వీకరించారు.
సెప్టెంబర్ 10న ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’కు భారీగా తరలిరండి – టీజీఈజేఏసీ పిలుపు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లో నిర్వహించే ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’కు భారీగా తరలిరావాలని టీజీఈజేఏసీ నాగర్ కర్నూల్ నాయకులు పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్లో ఘనంగా ఫిజియోథెరపీ అవగాహన ర్యాలీ
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారం అవుతోందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు. చెన్నారం గ్రామంలో లబ్ధిదారురాలు అనిత నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పాల్గొన్నారు.
ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిర్దేశకులు…
భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. నాగర్కర్నూల్లో 70 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.
వానాకాలం వరి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వానాకాలం వరి కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
భూ రీ-సర్వేను 10 రోజుల్లో పూర్తి చేయాలి
నాగర్కర్నూల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా పరిశీలించారు. రీ-సర్వే ప్రక్రియను ఖచ్చితత్వం, పారదర్శకతతో నిర్వహించి 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వెంకటాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్ మండలం వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ, వీవో భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సెప్టెంబర్ 9న నాగర్ కర్నూల్లో ఉచిత కంటి చికిత్స శిబిరం
జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నాగర్ కర్నూల్లోని శోభ ఆప్టికల్లో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన క్యాటరాక్ట్ రోగులకు ఉచిత ఆపరేషన్లు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
